వెలగపూడి రాళ్ల దాడి ఘటనలో పోలీసుల పాత్ర ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి సుచరిత

  • ఇటీవల వెలగపూడిలో రాళ్లదాడి
  • మహిళ మృతి, పలువురికి గాయాలు
  • వెలగపూడిలో ఇవాళ పర్యటించిన హోంమంత్రి
  • మృతురాలి కుటుంబీకులకు పరామర్శ
  • రూ.10 లక్షల పరిహారం ప్రకటన
ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇవాళ అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో పర్యటించారు. ఇటీవల వెలగపూడిలో రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబీకులను, గాయపడిన వారిని హోంమంత్రి ఇవాళ పరామర్శించారు. రాళ్లదాడి ఘటనలో పోలీసుల పాత్ర ఉందని తేలితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ పర్యటనలో  వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా పాల్గొన్నారు.

అయితే, ఈ దాడి ఘటన వెనుక ఎంపీ పాత్ర ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఎంపీ ప్రమేయంపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. హోంమంత్రి మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆమె పిల్లల్లో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

Mekathoti Sucharitha
Velagapudi
Stone Pelting
Victim
Ex Gratia

More Telugu News